Ganesh Laddu Robbery | లోకాలను కాపాడే వినాయకుడి లడ్డూలకే రక్షణ లేకుండా పోతుంది. వినాయక విగ్రహాలను ప్రతిష్టించి నాలుగైదు రోజులు కూడా గడవక ముందే నిర్వాహకులను ఓ కొత్త భయం వెంటాడుతోంది.
బొజ్జగణపయ్య లడ్డూలను దొంగలించడానికి చిలిపి దొంగలు రెచ్చిపోతున్నారు. సిటీలోని ప్రగతి నగర్, నిజాంపేట, కీసర వంటి ప్రాంతాల్లో ఇప్పటికే గణేశుడి లడ్డులను దొంగలు ఎత్తుకెళ్లారు.
దింతో వంతులవారిగా లడ్డులకు నిర్వహకులు కాపలా కాస్తున్నారు. లడ్డూలను కాపాడుకోవడానికి నానా తంటాలు పడుతున్నారు. వచ్చే వారు దొంగతనాల్లో ఆరితేరిన వారా ? అంటే అదీ కాదు. వినాయకుడి లడ్డూలను చోరీ చేస్తే కలిసివస్తుందనే నమ్మకం కొందర్లో బలంగా ఉంది.
చోరీ చేసిన వినాయకుడి లడ్డును తింటే సిరి సంపదలు వరిస్తాయని కొందరు నమ్ముతారు. ఇదే నమ్మకంతో కొందరు చిలిపి దొంగలు రెచ్చిపోతున్నారు.