Friday 30th January 2026
12:07:03 PM
Home > తాజా > వసూళ్లకు పాల్పడితేకఠిన చర్యలు: సీఎం వార్నింగ్!

వసూళ్లకు పాల్పడితేకఠిన చర్యలు: సీఎం వార్నింగ్!

CM Revanth Reddy to Delhi regarding allocation of departments to ministers

CM Revanth Warning | హైద్రాబాద్ (Hyderabad) నగరంలో చెరువుల పరిరక్షణే ధ్యేయంగా హైడ్రా (Hydra) అక్రమ నిర్మాణాలను కూలుస్తున్న విషయం తెలిసిందే. అయితే కొంతమంది హైడ్రా పేరుతో బెదిరింపులకు దిగుతూ, వసూళ్లకు పాల్పడుతున్నట్లు ముఖ్యమంత్రి దృష్టికి చేరింది.

దీంతో సీఎం రేవంత్ రెడ్డి హైడ్రా పేరుతో అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న అధికారులకు గట్టి వార్నింగ్ ఇచ్చారు. హైడ్రా పేరుతో కొంతమంది అధికారులు సామాన్యులను బెదిరింపులకు గురి చేస్తున్నట్లుగా ఫిర్యాదులు అందాయన్నారు.

మున్సిపల్, రెవెన్యూ అధికారులు డబ్బులు డిమాండ్ చేస్తున్నట్లుగా తన దృష్టికి వచ్చిందన్నారు. గతంలో ఇచ్చిన నోటీసులను అడ్డం పెట్టుకొని బెదిరిస్తున్నట్లుగా తెలిసిందన్నారు. అలాంటి వారిపై తప్పకుండా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

అమాయకులను భయపెట్టి డబ్బులు వసూలు చేస్తే ఎవ్వరైనా సరే ఊరుకునేది లేదని వార్నింగ్ ఇచ్చారు. హైడ్రా పేరుతో వసూళ్లకు పాల్పడే వారిపై ప్రత్యేక దృష్టి సారించాలని ఏసీబీ, విజిలెన్స్‌ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

You may also like
cm revant reddy completes course in usa
అమెరికాలో కోర్సు పూర్తి చేసుకున్న తెలంగాణ సీఎం!
cm revanth about medaram jathara
‘మేడారం తల్లుల స్పూర్తితో ప్రభుత్వం ఏర్పడింది’
kalvakuntla kavitha
‘కేసీఆర్ సమాచారాన్ని రేవంత్ కు చేరవేసే గూఢచారి ఆయనే’
cm revanth reddy
టీ-హబ్ లో ప్రభుత్వ ఆఫీసులు.. స్పందించిన సీఎం!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions