Wednesday 28th May 2025
12:07:03 PM
Home > తాజా > కొడంగల్ కు సీఎం రేవంత్..రూ.4 వేల కోట్ల పనుల శంకుస్థాపన

కొడంగల్ కు సీఎం రేవంత్..రూ.4 వేల కోట్ల పనుల శంకుస్థాపన

cm revath reddy

Cm Revanth Kodangal Tour| తెలంగాణ ( Telangana ) సీఎం గా బాధ్యతలు చేపట్టిన అనంతరం సొంత నియోజకవర్గం అయిన కొడంగల్ ( Kodangal ) లో పర్యటించనున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ( Cm Revanth Reddy ).

బుధవారం సాయంత్రం కొడంగల్ లో పర్యటించనున్న సీఎం రూ.4, 369 కోట్లు విలువ చేసే 20 పనులకు కోస్గి ( Kosgi ) ప్రభుత్వ పాఠశాల మైదానంలో శంకుస్థాపన చేయనున్నారు.

రూ.2,945 కోట్లతో నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించనున్నారు. ఇది పూర్తి అయితే ఈ ప్రాంతం మొత్తం సస్యశ్యామలం కానుంది.

అలాగే కొడంగల్ లో వైద్య, నర్సింగ్, ఫిజియోథెరపీ కళాశాలల పనులకూ శ్రీకారం చుట్టనున్నారు.

గ్రామీణ ప్రాంత రోడ్ల ఏర్పాటుకు రూ. 213 కోట్లు, రూ.45 కోట్లతో కొడంగల్ మున్సిపాలిటీ ( Muncipality ) అభివృద్ధి పనులను ప్రారంభించనున్నారు సీఎం రేవంత్.

అనంతరం సాయంత్రం 5 గంటలకు కోస్గిలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు సీఎం రేవంత్.

You may also like
అమృత్ భారత్ స్టేషన్లను ప్రారంభించిన ప్రధాని
క్యాన్సర్ బారిన పడిన వ్యక్తికి అండగా సీఎం
‘జల్సాల కోసం రూ.172 కోట్లతో హెలికాప్టర్’..YCP vs TDP
‘భారీగా పెరిగిన WTC ప్రైజ్ మనీ..ఎన్ని రూ.కోట్లంటే!’

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions