Friday 30th January 2026
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > ఏడాదిలో రెండుసార్లు టెన్త్, ఇంటర్ ఎగ్జామ్స్!

ఏడాదిలో రెండుసార్లు టెన్త్, ఇంటర్ ఎగ్జామ్స్!

Students

Board Exams Twice a Year | పదో తరగతి, ఇంటర్‌ బోర్డు పరీక్షలకు సంబంధించి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కీలక ప్రకటన చేశారు.

టెన్త్, ఇంటర్ బోర్డు పరీక్షలకు విద్యార్థులు రెండుసార్లు హాజరయ్యేందుకు అవకాశం ఇవ్వనున్నట్లు తెలిపారు. 2025-26 అకడమిక్ ఈయర్ నుంచి అమలు చేయనున్నట్లు వెల్లడించారు.

ఛత్తీస్‌గఢ్‌లో మంగళవారం పీఎం శ్రీ పథకాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బోర్డు పరీక్షలపై ఈ ప్రకటన చేశారు.

2020లో రూపొందించిన కొత్త జాతీయ విద్యా విధానంలో  విద్యార్థులపై ఒత్తిడిని తగ్గించడం ఒకటని, ఈ క్రమంలో విద్యార్థులు రెండుసార్లు బోర్డు పరీక్షలకు హాజరయ్యే అవకాశం కల్పించాలని నిర్ణయం తీసుకున్నట్లు కేంద్రమంత్రి తెలిపారు.

2025-26 విద్యా సంవత్సరం నుంచి విద్యార్థులు రెండుసార్లు 10, ఇంటర్‌ విద్యార్థులు బోర్డు పరీక్షలకు హాజరయ్యే అవకాశం ఉంటుందని తెలిపారు. 

You may also like
మేడారంలో అద్భుత దృశ్యం..జనంలోకి సమ్మక్క
పోలీసులకు గుడ్ న్యూస్..బర్త్ డే, పెళ్లి రోజున సెలవులు
కేసీఆర్ కు నోటీసులు..’సూర్యుడిపై ఉమ్మివేయడమే’
తల్లి పుట్టినరోజు..జిరాఫీలను దత్తత తీసుకున్న పవన్

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions