Friday 13th June 2025
12:07:03 PM
Home > తాజా > మీరంతా బహుబలి సినిమా చూశారా: కేటీఆర్

మీరంతా బహుబలి సినిమా చూశారా: కేటీఆర్

ktr road show

KTR Road Show | భారత రాష్ట్ర సమితి వర్కింగ్ (BRS) ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) మంగళవారం చేవెళ్ల (Chevella) లోక్ సభ పరిధిలోని రాజేంద్ర నగర్ లో జరిగిన రోడ్ షో లో పాల్గొన్నారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ కాంగ్రెస్ బీజేపీలపై తీవ్ర విమర్శలు చేశారు.

ఈసారి మోదీకి (Modi), ఎన్డీఏ కూటమికి 400 కాదు కనీసం 200ల సీట్లు కూడా వచ్చేలా లేవన్నారు. కాంగ్రెస్ పార్టీ (Congress) కూడా 100 నుంచి 150 సీట్లు కూడా వచ్చే పరిస్థితి లేదని జోస్యం చెప్పారు.

కేంద్రంలో అధికారంలోకి వచ్చేదెవరైనా మన వద్దకు రావాలంటే బీఆర్ఎస్ కు మంచి సీట్లు రావాలని అభిప్రాయపడ్డారు. బీఆర్ఎస్ కు 8 నుంచి 10 సీట్లు ఇస్తే మనం చెప్పినట్లే కేంద్రంలో ఉన్న ప్రభుత్వం వింటుందని చెప్పారు.

“తల్లి పాలు తాగి రొమ్ము గుద్దిన రంజిత్ రెడ్డి, కొండా విశ్వేశ్వర్ రెడ్డి కి బుద్ధి చెప్పాలె. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు పారిపోయే పిరికిపందలకు తప్పకుండా బుద్ధి చెప్పాలె. బలహీన వర్గాలను ఒక్కటి చేసిన బహుబలి కాసాని జ్ఞానేశ్వర్ గారు.

బలహీనవర్గాలకు సీట్లు ఇస్తే గెలవరన్న అపవాదు ఉంది. అది తప్పని నిరూపించాలె. చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గంలో మొదటి సారిగా బీసీ అభ్యర్థి బరిలో ఉన్నారు.

అందరం కలిసి కాసాని అన్నను గెలిపించుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. అరచేతిలో వైకుంఠం చూపించిన కాంగ్రెస్ పార్టీని నిలదీయాలే. రైతుల దగ్గరకు వెళ్లి రూ. 2 లక్షల హామీ నెరవేరిందా అని అడగాలె.

మీరంతా బహుబలి సినిమా చూశారా? అందులో రెండు పార్ట్ లు ఉన్నట్లే. రేవంత్ రెడ్డి మోసం పార్ట్-1 అయిపోతుంది. మోసం పార్ట్-2 సీక్వెల్ పెట్టుకున్నాడు రేవంత్ రెడ్డి. ఒకసారి మోసపోయింది చాలాదా? ఒక్కసారి మోసపోతే మోసం చేసిన వాడి తప్పు. రెండో సారి మోసం పోతే నమ్మిన వాళ్లది తప్పు.

కేసీఆర్ అభివృద్ధి చేసిన పదేళ్ల పాలన ఒకవైపు.. 100 రోజుల అబద్దాల పాలన ఒక వైపు. రైతుబంధు, కళ్యాణ లక్ష్మి, రైతుబీమా, కేసీఆర్ కిట్ ఇలా చెప్పుకుంటూ పోతే కేసీఆర్ ఎంతో మంచి చేసిండు. చేవెళ్లలో బ్రహ్మండమైన అభివృద్ధి చేసుకున్నాం. వికారాబాద్ ను జిల్లా చేసుకున్నాం.

111 జీవోను కూడా ఎత్తివేసింది కేసీఆర్ మాత్రమే అన్నది గుర్తు చేసుకోవాలె. బీజేపీ పదేళ్లలో ఏమీ చేశారో చెప్పి ఓటు అడుగుమంటే చెప్పేందుకు ఒక్కటి లేదు. మోదీ తెలంగాణకు ఒక్క కాలేజ్ పెట్టినవా, స్కూల్ ఇచ్చినవా, జాతీయ ప్రాజెక్ట్ ఇచ్చినవా? ఏమీ ఇచ్చినవ్.

ఈ ప్రాంతానికి బీజేపీ ఏం చేసిందని కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఓటు అడుగుతాడు. కృష్ణానీళ్లలో వాటా తేల్చుమంటే పదేళ్లుగా దాన్ని తేల్చలేదు. పాలమూరుకు జాతీయ హోదా ఇవ్వమంటే ఇవ్వని పార్టీ అంటే బీజేపీయే. బీజేపీని అడ్డుకునేది ఎవరైనా ఉన్నారంటే అది కేసీఆర్ మాత్రమే.

ఈటల, రఘునందన్ రావు, అర్వింద్, సోయం బాపురావును ఓడించిందెవరు. కిషన్ రెడ్డిని పోటీ చేసేందుకే భయపడేలా చేసిందే బీఆర్ఎస్ అన్న విషయం గుర్తుంచుకోవాలె. రంజిత్ రెడ్డి కాంగ్రెస్ లో చేరిన వెంటనే చేవెళ్లలో కాంగ్రెస్ పార్టీ పని అయిపోయింది.

తెలంగాణ ప్రజలు మంచోళ్లు. అమ్మలాంటి పార్టీని మోసం చేసిన రంజిత్ రెడ్డికి కచ్చితంగా బుద్ధి చెప్తారు. చేవెళ్లలో బలహీన వర్గాల అభ్యర్థి కాసాని గెలిపించుకుందాం. తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ కు 8-10 సీట్లు ఇస్తే మనమే అభివృద్ధి విషయంలో కేంద్రాన్ని డిమాండ్ చేయవచ్చు” అని పిలుపునిచ్చారు కేటీఆర్.

You may also like
car hangs mid air
Google Map ను నమ్మి ప్రయాణం.. నిర్మాణంలో ఉన్న బ్రిడ్జ్ పైకి కారు!
maganti gopinath
బీఆరెస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ కన్నుమూత!
kavlakuntla kavitha news office
తెలంగాణ జాగృతి కొత్త ఆఫీస్ ప్రారంభించిన కవిత!
bandi sanjay
‘చార్ పత్తా ఆట..’ కవిత వ్యవహారంపై బండి సంజయ్ హాట్ కామెంట్స్!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions