Friday 13th June 2025
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > డాలర్ కు పోటీగా BRICS CURRENCY..నమూనా విడుదల చేసిన పుతిన్

డాలర్ కు పోటీగా BRICS CURRENCY..నమూనా విడుదల చేసిన పుతిన్

BRICS Currency News | రష్యా ( Russia ) లోని ఖజాన్ ( Kazan ) నగరంలో బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు జరుగుతున్న విషయం తెల్సిందే. ఈ సదస్సులో భారత ప్రధాని మోదీ ( PM Modi ), రష్యా అధ్యక్షుడు పుతిన్ ( Putin ), చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ ( Xi Jinping ), సౌత్ ఆఫ్రికా, బ్రెజిల్ అధినేతలు పాల్గొన్నారు.

అలాగే వీరితో పాటు ఇతర దేశాల అధినేతలు సైతం పాల్గొన్నారు. ఈ సందర్భంగా బ్రిక్స్ దేశాల మధ్య జరిగే లావాదేవీలకు లోకల్ కరెన్సీ ని వినియోగించాలని పుతిన్ ప్రతిపాదించారు. డాలర్ కు పోటీగా ఈ కరెన్సీ రూపాంతరం చెందే అవకాశం ఉంది. దీన్నే డీ డాలరైజేషన్ ( De Dollarization ) అంటున్నారు.

ఇదిలా ఉండగా సదస్సులో భాగంగా బ్రిక్స్ కరెన్సీ నమూనాను పుతిన్ విడుదల చేసినట్లు తెలుస్తోంది. సదరు నోటుపై 100 విలువ అని రాసి ఉంది. నోటుకు ఓ వైపు భారత్, చైనా, రష్యా, బ్రెజిల్, సౌత్ ఆఫ్రికా దేశాల పతాకం ఉంది.

అంతేకాకుండా నోటుపై తాజ్ మహాల్ ( Taj Mahal )చిత్రం కూడా దర్శనిమిచ్చింది. ప్రస్తుతం పుతిన్ చేతితో పట్టుకున్న బ్రిక్స్ కరెన్సీ నోటు నమూనా వైరల్ గా మారింది.

You may also like
car hangs mid air
Google Map ను నమ్మి ప్రయాణం.. నిర్మాణంలో ఉన్న బ్రిడ్జ్ పైకి కారు!
అమృత్ భారత్ స్టేషన్లను ప్రారంభించిన ప్రధాని
క్యాన్సర్ బారిన పడిన వ్యక్తికి అండగా సీఎం
‘జల్సాల కోసం రూ.172 కోట్లతో హెలికాప్టర్’..YCP vs TDP

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions