Tuesday 8th April 2025
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > డాలర్ కు పోటీగా BRICS CURRENCY..నమూనా విడుదల చేసిన పుతిన్

డాలర్ కు పోటీగా BRICS CURRENCY..నమూనా విడుదల చేసిన పుతిన్

BRICS Currency News | రష్యా ( Russia ) లోని ఖజాన్ ( Kazan ) నగరంలో బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు జరుగుతున్న విషయం తెల్సిందే. ఈ సదస్సులో భారత ప్రధాని మోదీ ( PM Modi ), రష్యా అధ్యక్షుడు పుతిన్ ( Putin ), చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ ( Xi Jinping ), సౌత్ ఆఫ్రికా, బ్రెజిల్ అధినేతలు పాల్గొన్నారు.

అలాగే వీరితో పాటు ఇతర దేశాల అధినేతలు సైతం పాల్గొన్నారు. ఈ సందర్భంగా బ్రిక్స్ దేశాల మధ్య జరిగే లావాదేవీలకు లోకల్ కరెన్సీ ని వినియోగించాలని పుతిన్ ప్రతిపాదించారు. డాలర్ కు పోటీగా ఈ కరెన్సీ రూపాంతరం చెందే అవకాశం ఉంది. దీన్నే డీ డాలరైజేషన్ ( De Dollarization ) అంటున్నారు.

ఇదిలా ఉండగా సదస్సులో భాగంగా బ్రిక్స్ కరెన్సీ నమూనాను పుతిన్ విడుదల చేసినట్లు తెలుస్తోంది. సదరు నోటుపై 100 విలువ అని రాసి ఉంది. నోటుకు ఓ వైపు భారత్, చైనా, రష్యా, బ్రెజిల్, సౌత్ ఆఫ్రికా దేశాల పతాకం ఉంది.

అంతేకాకుండా నోటుపై తాజ్ మహాల్ ( Taj Mahal )చిత్రం కూడా దర్శనిమిచ్చింది. ప్రస్తుతం పుతిన్ చేతితో పట్టుకున్న బ్రిక్స్ కరెన్సీ నోటు నమూనా వైరల్ గా మారింది.

You may also like
‘పెట్రోల్ డీజిల్ పై ఎక్సైజ్ డ్యూటీ పెంపు’
‘షాకిచ్చిన కేంద్రం..ఒకేసారి గ్యాస్ పై రూ.50 పెంపు’
‘HCU విద్యార్ధులపై కేసులు..డిప్యూటీ సీఎం కీలక ఆదేశాలు’
‘నా జీవితం ఎందరికో గుణపాఠం..శ్రీరెడ్డి కీలక వ్యాఖ్యలు’

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions