Monday 12th January 2026
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > ‘అయోధ్యలో ఈ అంధకారం మంచిది కాదు’

‘అయోధ్యలో ఈ అంధకారం మంచిది కాదు’

Akhilesh Yadav Criticises Ayodhya Deepotsav | ఉత్తరప్రదేశ్ లోని బీజేపీ ప్రభుత్వం పై విమర్శలు గుప్పించారు మాజీ సీఎం, సమజ్వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్. దీపావళి పండుగ సందర్భంగా సరయు నదీ ఒడ్డున అయోధ్య రామాలయంలో 26 లక్షల దీపాలను వెలిగించారు.

ఈ కార్యక్రమం కోసం ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేసింది. అయితే సోమవారం దీపోత్సవ కార్యక్రమం ముగిసిన వెంటనే స్థానికులు దీపాలలో మిగిలిపోయిన నూనెను బాటిళ్లలో నింపుకుని తీసుకెళ్లారు. గతంలో కూడా ఇలానే జరిగింది. దీనికి సంబంధించిన వీడియోలు వైరల్ గా మారాయి. ఈ నేపథ్యంలో ఎస్పీ చీఫ్ అఖిలేశ్ స్పందించారు.

‘అట్టహాసంగా నిర్వహించిన కార్యక్రమంలో లక్షల దీపాలు వెలిగించిన దృశ్యాలు తాత్కాలికం, వాస్తవం అయిన దృశ్యాలు ఇవి. భారీ వెలుతురు తర్వాత ఈ అంధకారం మంచి కాదు’ అని అఖిలేశ్ పేర్కొన్నారు. అంటే ప్రజల దుర్భర స్థితిని మార్చాలి అంతేకాని రూ.కోట్లు ఖర్చు చేసి అట్టహాసంగా కార్యక్రమాలు నిర్వహించడం కాదని ఆయన పరోక్షంగా అన్నారు.

You may also like
అల్లు అర్జున్ పాట పాడి అదరగొట్టిన కేంద్రమంత్రి
చెప్పులు లేకుండా రోడ్డుపై రౌడీలు..గుంటూరు పోలీసుల తీరే వేరు!
‘హిజాబ్ ధరించిన మహిళ ప్రధాని అవుతారు’..ఒవైసీ vs బండి
సైబర్ వలలో జేడీ లక్ష్మీనారాయణ సతీమణి

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions