Sunday 11th January 2026
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > ‘మోదీజీ పాకిస్థాన్ వెళ్లి ఆ ఉగ్రవాదుల్ని తీసుకురండి’

‘మోదీజీ పాకిస్థాన్ వెళ్లి ఆ ఉగ్రవాదుల్ని తీసుకురండి’

Owaisi urges Modi to bring 26/11 masterminds from Pakistan | హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మాదిరిగానే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా పాకిస్థాన్ కు సైన్యాన్ని పంపి ముంబయిలో 26/11 ఉగ్రదాడి వెనుక ఉన్న మాస్టర్ మైండ్స్ ను పట్టుకురావలని డిమాండ్ చేశారు. తాజగా అమెరికా సైన్యం వెనెజువెలా దేశంపై సైనిక చర్య జరిపి ఆ దేశ అధ్యక్షుడు నోకొలస్ మధురోను మరియు ఆయన భార్యను బంధించి అమెరికా తీసుకెళ్లిన విషయం తెల్సిందే.

ఈ ఘటనను ప్రస్తావించిన ఒవైసీ ప్రధాని మోదీ కూడా పాకిస్థాన్ లో నక్కిన ఉగ్రవాదులపై ఇలాంటి చర్య తీసుకోవాలన్నారు. ఈ మేరకు ముంబయి లో జరిగిన ఎన్నికల ప్రచార ర్యాలీలో ఈ వ్యాఖ్యలు చేశారు. ముంబయి నగరంలో ఉగ్ర కుట్ర పన్నిన క్రూరులు మసూద్ అజర్ అయినా సరే లేదా లష్కరే తోయిబా అయినా పాకిస్థాన్ నుంచి ఈ ముష్కరులను ఎందుకు తీసుకురాకూడదు అని అడిగారు. తనది 56 ఇంచుల ఛాతీ అని చెప్పుకునే మోదీ సైన్యాన్ని పంపి ఉగ్రవాదులను ఎందుకు తీసుకురారు అని వ్యంగ్యంగా ప్రశ్నించారు.

You may also like
అల్లు అర్జున్ పాట పాడి అదరగొట్టిన కేంద్రమంత్రి
చెప్పులు లేకుండా రోడ్డుపై రౌడీలు..గుంటూరు పోలీసుల తీరే వేరు!
‘హిజాబ్ ధరించిన మహిళ ప్రధాని అవుతారు’..ఒవైసీ vs బండి
సైబర్ వలలో జేడీ లక్ష్మీనారాయణ సతీమణి

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions