Sunday 13th September 2026
12:07:03 PM
Home > తాజా > కట్టుకథలు అల్లారు..హైకోర్టులో పట్నం క్వాష్ పిటిషన్

కట్టుకథలు అల్లారు..హైకోర్టులో పట్నం క్వాష్ పిటిషన్

Patnam Narender Reddy Quash Petition | వికారాబాద్ జిల్లా దుద్యాల మండలం లగచర్ల గ్రామంలో అధికారులపై జరిగిన దాడి ఉదంతం రాజకీయ మలుపు తీసుకుంది.

తాజగా లగచర్ల ఘటనలో ఏ1 ( A1 ) నిందితుడిగా ఉన్న పట్నం నరేందర్ రెడ్డి హైకోర్టులో క్వాష్ పిటిషన్ ( Quash Petition ) దాఖలు చేశారు. ప్రస్తుతం చర్లపల్లి జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న పట్నం న్యాయవాదుల ద్వారా అఫిడవిట్ పంపించారు.

బుధవారం ఉదయం కేబీఆర్ పార్కు ( KBR Park ) వద్ద తనను పోలీసులు అదుపులోకి తీసుకుని, బలవంతంగా కారులో ఎక్కించి వికారాబాద్ డీటీసీకి తరలించినట్లు అఫిడవిట్ లో ఆయన పేర్కొన్నారు. ముందుగా పోలీసులు తన నుండి ఎటువంటి స్టేట్మెంట్ ( Statement ) తీసుకోలేదని, కోర్టులో హాజరుపరిచే 10నిమిషాల ముందు కొన్ని పేపర్లపై సంతకాలు తీసుకున్నట్లు పట్నం పేర్కొన్నారు.

తన నుండి పోలీసులు ఎటువంటి వాంగ్మూలం తీసుకోలేదన్నారు. తనను అక్రమంగా అరెస్ట్ చేసి, కేసులో ఇరికించినట్లు చెప్పారు. కేటీఆర్ ( KTR ) ఆదేశాలతో దాడులు చేయించినట్లు పోలీసులు కట్టుకథ అల్లారని, పోలీసులు చెప్పేదాంట్లో నిజం లేదని తెలిపారు. ఈ క్రమంలో తన స్టేట్మెంట్ ను పరిగణలోకి తీసుకొని విచారణ జరపాలని అఫిడవిట్ లో పట్నం చెప్పుకొచ్చారు.

You may also like
pawan kalyan
సోషల్ మీడియాలో హద్దులు దాటొద్దు: పవన్
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను నేటి యువత కాపాడుకోవాలి: మంత్రి అడ్లూరి
Jupally krishna rao
తెలంగాణలో మ‌ద్యం అమ్మ‌కాల‌ను ప్రోంత్స‌హించిందెవ‌రు?
Kumbha mela monalisa
‘లవ్ జిహాద్’.. స్పందించిన కుంభమేళా మోనాలిసా!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions