Monday 12th January 2026
12:07:03 PM
Home > తాజా > గ్రూప్-1 పై హైకోర్టు సంచలన తీర్పు

గ్రూప్-1 పై హైకోర్టు సంచలన తీర్పు

TGPSC Group-1 Mains Result Cancelled Telangana | తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన గ్రూప్-1 మెయిన్స్ పరీక్ష పై రాష్ట్ర హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది.

గ్రూప్-1 మూల్యాంకనంలో అవకతవకలు జరిగాయని, పరీక్షలను రద్దు చేయాలని కోరుతూ కొందరు అభ్యర్థులు హై కోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. మరోవైపు ఎంపిక ప్రక్రియ పూర్తయిన నేపథ్యంలో పరీక్షలు రద్దు చేయకూడదని మరికొందరు పిటిషన్లు దాఖలు చేశారు.

ఈ పిటిషన్లపై జులై 7న హై కోర్టు న్యాయమూర్తి జస్టిస్ నామవరపు రాజేశ్వరరావు వాదనలు విన్నారు. ఈ మేరకు మంగళవారం తుది తీర్పు వెల్లడించారు. మార్చి 10న ఇచ్చిన ఫలితాల ఆధారంగా ప్రకటించిన జనరల్ ర్యాంకింగ్ లిస్టును మరియు మార్కుల జాబితాను న్యాయస్థానం కొట్టివేసింది.

గ్రూప్-1 మెయిన్స్ జవాబు పత్రాలను రీవాల్యుయేషన్ చేయాలని కోర్టు ఆదేశించింది. 8 నెలల్లో రీవాల్యుయేషన్ ప్రక్రియ పూర్తి చేయాలని స్పష్టం చేసింది. లేనిపక్షంలో గ్రూప్- 1 మెయిన్స్ పరీక్షను మళ్లీ నిర్వహించాలని తుది తీర్పు వెలువరించింది.

You may also like
అల్లు అర్జున్ పాట పాడి అదరగొట్టిన కేంద్రమంత్రి
చెప్పులు లేకుండా రోడ్డుపై రౌడీలు..గుంటూరు పోలీసుల తీరే వేరు!
‘హిజాబ్ ధరించిన మహిళ ప్రధాని అవుతారు’..ఒవైసీ vs బండి
సైబర్ వలలో జేడీ లక్ష్మీనారాయణ సతీమణి

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions