Tuesday 17th March 2026
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > కాంగ్రెస్ ఫేక్ వాగ్దానాలు.. ప్రధానికి కౌంటర్ ఇచ్చిన సీఎం రేవంత్

కాంగ్రెస్ ఫేక్ వాగ్దానాలు.. ప్రధానికి కౌంటర్ ఇచ్చిన సీఎం రేవంత్

Cm Revanth Responds To Pm Modi Allegations | ప్రధాని నరేంద్ర మోదీ ( PM Modi ) చేసిన ఆరోపణలకు బదులిచ్చారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.

కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు హిమాచల్ ప్రదేశ్ ( Himachal Pradesh ), కర్ణాటక ( Karnataka ), తెలంగాణ ( Telangana )లో ఆర్థిక పరిస్థితి అధ్వానంగా మారుతుందని విమర్శించారు. కాంగ్రెస్ ప్రకటించిన గ్యారంటీలు అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. ఈ క్రమంలో సీఎం రేవంత్ స్పందించారు.

డిసెంబర్ 7 2023న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన అనంతరం కేవలం రెండురోజుల్లోనే మహిళలకు ఆర్టీసీ ( RTC ) బస్సుల్లో ఉచిత ప్రయాణం, ఆరోగ్య శ్రీ కవరేజిని రూ.10 లక్షలకు పెంచడం జరిగిందని గుర్తుచేశారు.

దాదాపు దశాబ్దం పాటు BRS దుష్పరిపాలన తర్వాత రాష్ట్రాన్ని ఆనందం & ఆశలు వెల్లువెత్తాయని పేర్కొన్నారు. అలాగే 22 లక్షల 22 వేల మంది రైతులకు రుణమాఫీ చేసిన విషయాన్ని తెలిపారు. 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రూ.500 కే గ్యాస్ సిలిండర్ ( Gas Cylinder ) వంటి పథకాలను మొదలుపెట్టినట్లు చెప్పారు.

గ్రూప్ పరీక్షలు నిర్వహించడం మరియు 50,000 మందికి ఉద్యోగాల నియామక పాత్రలను అందించమన్నారు. ఈ సందర్భంగా ప్రజలకు చేసిన వాగ్దానాల పట్ల నిబద్ధతతో పనిచేస్తున్నట్లు సీఎం స్పష్టం చేశారు.

You may also like
Kumbha mela monalisa
‘లవ్ జిహాద్’.. స్పందించిన కుంభమేళా మోనాలిసా!
gaddar awards
గద్దర్ సినీ అవార్డులను ప్రకటించిన ప్రభుత్వం.. ఉత్తమ చిత్రం ఏదంటే!
kalvakuntla kavitha
‘ఎస్సీల రిజర్వేషన్లు 18 శాతానికి పెంచాలి’
రాష్ట్రంలో కాంగ్రెస్ బుల్డోజర్ రాజ్యం

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions