Wednesday 4th June 2025
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > కాంగ్రెస్ ఫేక్ వాగ్దానాలు.. ప్రధానికి కౌంటర్ ఇచ్చిన సీఎం రేవంత్

కాంగ్రెస్ ఫేక్ వాగ్దానాలు.. ప్రధానికి కౌంటర్ ఇచ్చిన సీఎం రేవంత్

Cm Revanth Responds To Pm Modi Allegations | ప్రధాని నరేంద్ర మోదీ ( PM Modi ) చేసిన ఆరోపణలకు బదులిచ్చారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.

కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు హిమాచల్ ప్రదేశ్ ( Himachal Pradesh ), కర్ణాటక ( Karnataka ), తెలంగాణ ( Telangana )లో ఆర్థిక పరిస్థితి అధ్వానంగా మారుతుందని విమర్శించారు. కాంగ్రెస్ ప్రకటించిన గ్యారంటీలు అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. ఈ క్రమంలో సీఎం రేవంత్ స్పందించారు.

డిసెంబర్ 7 2023న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన అనంతరం కేవలం రెండురోజుల్లోనే మహిళలకు ఆర్టీసీ ( RTC ) బస్సుల్లో ఉచిత ప్రయాణం, ఆరోగ్య శ్రీ కవరేజిని రూ.10 లక్షలకు పెంచడం జరిగిందని గుర్తుచేశారు.

దాదాపు దశాబ్దం పాటు BRS దుష్పరిపాలన తర్వాత రాష్ట్రాన్ని ఆనందం & ఆశలు వెల్లువెత్తాయని పేర్కొన్నారు. అలాగే 22 లక్షల 22 వేల మంది రైతులకు రుణమాఫీ చేసిన విషయాన్ని తెలిపారు. 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రూ.500 కే గ్యాస్ సిలిండర్ ( Gas Cylinder ) వంటి పథకాలను మొదలుపెట్టినట్లు చెప్పారు.

గ్రూప్ పరీక్షలు నిర్వహించడం మరియు 50,000 మందికి ఉద్యోగాల నియామక పాత్రలను అందించమన్నారు. ఈ సందర్భంగా ప్రజలకు చేసిన వాగ్దానాల పట్ల నిబద్ధతతో పనిచేస్తున్నట్లు సీఎం స్పష్టం చేశారు.

You may also like
అమృత్ భారత్ స్టేషన్లను ప్రారంభించిన ప్రధాని
క్యాన్సర్ బారిన పడిన వ్యక్తికి అండగా సీఎం
‘జల్సాల కోసం రూ.172 కోట్లతో హెలికాప్టర్’..YCP vs TDP
‘భారీగా పెరిగిన WTC ప్రైజ్ మనీ..ఎన్ని రూ.కోట్లంటే!’

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions