Monday 12th January 2026
12:07:03 PM
Home > ఆంధ్రప్రదేశ్ > ‘కుటుంబంతో పోటీ..ఎన్నికల కంటే కష్టం’

‘కుటుంబంతో పోటీ..ఎన్నికల కంటే కష్టం’

Nara Lokesh News | మంత్రి నారా లోకేశ్ ఎక్స్ వేదికగా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. కుటుంబ సభ్యులతో పోటీ పడడం ఎన్నికల్లో పోటీ చేయడం కంటే కష్టం అని అన్నారు. తాజగా ముఖ్యమంత్రి చంద్రబాబును ‘బిజినెస్ రీఫార్మర్ ఆఫ్ ది ఇయర్’ పురస్కారంతో ప్రముఖ సంస్థ ఎకనామిక్ టైమ్స్ సత్కరించిన విషయం తెల్సిందే. తండ్రికి ఈ గౌరవం లభించడం పట్ల తనయుడు లోకేశ్ హర్షం వ్యక్తం చేశారు. అయితే కుటుంబ సభ్యులందరూ వివిధ రంగాల్లో అవార్డులను సొంతం చేసుకుంటున్నారని వారితో పోటీ పడడం తనకు కష్టంగా ఉందని లోకేశ్ చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి.

‘తండ్రి ‘బిజినెస్ రీఫార్మర్ ఆఫ్ ది ఇయర్’ అవార్డును గెలిచారు. అమ్మ ‘గోల్డెన్ పీకాక్’ పురస్కారాన్ని ఇంటికి తీసుకువచ్చారు. సతీమణి బ్రాహ్మణి ‘మోస్ట్ పవర్ఫుల్ ఉమెన్ ఇన్ బిజినెస్’ లో ఒకరు. తనయుడు దేవాన్ష్ చెస్ ఛాంపియన్. కుటుంబ సభ్యులతో పోటీ పడడం ఎన్నికలను ఎదుర్కోవడం కంటే కష్టం అని నేను గుర్తించాను’ అని లోకేశ్ సరదాగా పోస్ట్ చేశారు.

You may also like
అల్లు అర్జున్ పాట పాడి అదరగొట్టిన కేంద్రమంత్రి
చెప్పులు లేకుండా రోడ్డుపై రౌడీలు..గుంటూరు పోలీసుల తీరే వేరు!
‘హిజాబ్ ధరించిన మహిళ ప్రధాని అవుతారు’..ఒవైసీ vs బండి
సైబర్ వలలో జేడీ లక్ష్మీనారాయణ సతీమణి

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions