Monday 12th January 2026
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > భారత పౌరసత్వాన్ని వదులుకున్న 20 లక్షల మంది

భారత పౌరసత్వాన్ని వదులుకున్న 20 లక్షల మంది

Nearly 9 Lakh Indians Gave Up Citizenship In Five Years | భారతీయ పౌరసత్వాన్ని వదులుకునే వారి సంఖ్య రోజు రోజులు అధికం అవుతుంది. దీని వెనుక అనేక కారణాలు ఉన్నప్పటికీ ఇది ఆందోళన కలిగించే అంశం అని నిపుణులు పేర్కొంటున్నారు. గత ఐదేళ్లలో సుమారు 9 లక్షల మంది అలాగే 2011 నుంచి 2019 మధ్య ఏకంగా 12 లక్షల మంది పౌరసత్వాన్ని వదులుకున్నారు. అంటే 2011 నుంచి 2024 వరకు 20 లక్షల మంది భారత పౌరసత్వాన్ని వదులుకున్నారు.

ఈ విషయాన్ని కేంద్ర విదేశాంగ శాఖ పార్లమెంటులో వెల్లడించింది. రాజ్యసభ లో ఒక ప్రశ్నకు లిఖితపూర్వకంగా సమాధానం ఇస్తూ కేంద్ర విదేశాంగ సహాయ మంత్రి కిర్తి వర్ధన్ సింగ్ ఈ డేటాను వెల్లడించారు. 2011-2019 మధ్య 11,89,194 మంది పౌరసత్వాన్ని వదులుకున్నట్లు తెలిపారు. అలాగే 2019-2024 మధ్య 8,96,843 మంది పౌరసత్వాన్ని వదులుకున్నారని మంత్రి వివరించారు. అత్యధికంగా 2022లో 2,25,620 మంది భారతీయ పౌరసత్వాన్ని కాదని విదేశీ పౌరసత్వాన్ని పొందారు. మరోవైపు గత ఐదేళ్లలో కేవలం 800 మంది విదేశీయులు మాత్రమే దేశ పౌరసత్వాన్ని పొందారు.

You may also like
అల్లు అర్జున్ పాట పాడి అదరగొట్టిన కేంద్రమంత్రి
చెప్పులు లేకుండా రోడ్డుపై రౌడీలు..గుంటూరు పోలీసుల తీరే వేరు!
‘హిజాబ్ ధరించిన మహిళ ప్రధాని అవుతారు’..ఒవైసీ vs బండి
సైబర్ వలలో జేడీ లక్ష్మీనారాయణ సతీమణి

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions