Sunday 11th January 2026
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > శ్రీశైలంలో ప్రధాని..ఒకే హెలికాప్టర్ లో మోదీ, బాబు, పవన్

శ్రీశైలంలో ప్రధాని..ఒకే హెలికాప్టర్ లో మోదీ, బాబు, పవన్

PM Modi Srisailam Tour | ప్రధాని నరేంద్ర మోదీ ఆంధ్రప్రదేశ్ పర్యటన కొనసాగుతుంది. గురువారం ఉదయం కర్నూలు విమానాశ్రయం చేరుకున్న ప్రధానికి ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్వాగతం పలికారు.

అనంతరం ఈ ముగ్గురు ఒకే హెలికాప్టర్ లో శ్రీశైలం బయలుదేరారు. అనంతరం శ్రీశైలం క్షేత్రానికి చేరుకున్న ప్రధాని, ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి కి ఆలయ అర్చకులు, అధికారులు స్వాగతం పలికారు. భ్రమరాంబ మల్లిఖార్జున స్వామిని ప్రధాని దర్శించుకున్నారు.

ఆ తర్వాత శివాజీ దర్బార్ హాల్, ధ్యాన కేంద్రాన్ని ప్రధాని తిలకించారు. ఏపీ పర్యటనలో భాగంగా ప్రధాని ఓర్వకల్లు పారిశ్రామిక వాడకు మోదీ శంకుస్థాపన చేస్తారు. అలాగే ‘సూపర్ జీఎస్టీ..సూపర్ సేవింగ్స్’ బహిరంగ సభలో భాగంగా ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు.

You may also like
అల్లు అర్జున్ పాట పాడి అదరగొట్టిన కేంద్రమంత్రి
చెప్పులు లేకుండా రోడ్డుపై రౌడీలు..గుంటూరు పోలీసుల తీరే వేరు!
‘హిజాబ్ ధరించిన మహిళ ప్రధాని అవుతారు’..ఒవైసీ vs బండి
సైబర్ వలలో జేడీ లక్ష్మీనారాయణ సతీమణి

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions