Friday 8th May 2026
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలుగువారు మృతి!

అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలుగువారు మృతి!

telugu people died in usa

అమెరికాలోని ఫ్లోరిడాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు తెలుగువారు మరణించారు. భారత కాలమానం ప్రకారం తెల్లవారుజామున 3 గంటలకు కారు ప్రమాదం జరిగింది.  

వివరాల్లోకి వెళితే.. తెలంగాణలోని సిద్దిపేట జిల్లా బక్రి చెప్యాల చెందిన రోహిత్ రెడ్డి, భార్య ప్రగతి రెడ్డి, ఇద్దరు కుమారులు, తల్లి సునీతతో అమెరికాలోని ఫ్లోరిడాలో నివాసం ఉంటున్నారు. రోహిత్ రెడ్డి తన కుటుంబ సభ్యులతో కలిసి కారులో వెళ్తుండగా ప్రమాదం జరిగింది. రోహిత్ రెడ్డి భార్య ప్రగతి రెడ్డి, పెద్దకుమారుడు అర్విన్, తల్లి సునీత అక్కడికక్కడే మృతిచెందారు.

రోహిత్ రెడ్డి, చిన్నకుమారుడు గాయాలతో బయటపడ్డారు. ఘటన జరిగిన సమయంలో రోహిత్ కారు నడిపారు. ఈ ప్రమాదంతో ప్రగతి రెడ్డి స్వస్థలం రంగారెడ్డి జిల్లా టేకులపల్లిలో విషాదఛాయలు అలముకున్నాయి. కుటుంబసభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరవుతున్నారు.

సమాచారం తెలిసిన వెంటనే ప్రగతి రెడ్డి తల్లిదండ్రులు మోహన్ రెడ్డి, పవిత్రాదేవి అమెరికాకు బయల్దేరారు. మృతులకు ఫ్లోరిడాలోనే దహన సంస్కారాలు చేస్తామని కుటుంబసభ్యులు తెలిపారు.

You may also like
dr preeti reddy gives clarity on joingin bjp
బీజేపీలోకి మల్లారెడ్డి కోడలు.. క్లారిటీ ఇచ్చిన ప్రీతి రెడ్డి!
aiswarya rajesh
విజయ్ పై ఐశ్వర్య రాజేశ్ ఆసక్తికర వ్యాఖ్యలు!
నిజాయతీలో మా పిల్లలు బంగారం.. విద్యార్థినులపై మంత్రి లోకేశ్ ప్రశంసలు!
ssc hall tickes on whatsapp
WhatsApp ద్వారా SSC హాల్ టికెట్స్.. డౌన్ లోడ్ చేసుకోండిలా!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions