Sunday 30th August 2026
12:07:03 PM
Home > క్రీడలు > పెర్త్ కు చేరుకున్న రోహిత్ శర్మ

పెర్త్ కు చేరుకున్న రోహిత్ శర్మ

Rohit Sharma Lands In Australia | బోర్డర్-గావస్కర్ ( Border-Gavaskar ) ట్రోఫీలో భాగంగా పెర్త్ ( Perth ) వేదికగా ఆస్ట్రేలియా, ఇండియా మధ్య తొలి టెస్టు జరుగుతున్న విషయం తెల్సిందే.

మూడవ రోజు ఆట జరుగుతున్న సమయంలోనే టీం ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ ( Rohit Sharma ) పెర్త్ లో అడుగుపెట్టాడు. తన సతీమణి రితికా మగబిడ్డకు జన్మనిచ్చిన విషయం తెల్సిందే.

ఈ క్రమంలో రోహిత్ తొలి టెస్టుకు దూరం అయ్యాడు. అతని స్థానంలో బుమ్రా ( Jasprit Bumrah ) టీంను లీడ్ చేస్తున్నాడు. పెర్త్ టెస్టు జరుగుతున్న సమయంలోనే ఆస్ట్రేలియా చేరుకోవడంతో అడిలైడ్ వేదికగా జాతగబోయే రెండవ టెస్టులో రోహిత్ శర్మ ఆడడం ఖాయం అనిపిస్తుంది.

అయితే రెండవ టెస్టు కంటే ముందే ప్రైమ్ మినిస్టర్స్ XI టీంతో కాన్బెర్రా వేదికగా జరగబోయే వార్మప్ మ్యాచులో భారత్ ఆడనుంది. నవంబర్ 30 నుండి డిసెంబర్ 1 వరకు జరిగే ఈ మ్యాచులో రోహిత్ పాల్గొనే అవకాశం ఉంది.

You may also like
pawan kalyan
సోషల్ మీడియాలో హద్దులు దాటొద్దు: పవన్
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను నేటి యువత కాపాడుకోవాలి: మంత్రి అడ్లూరి
రూ.10 లక్షల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లిన ఎలుక!
‘విద్యార్థులను స్కిల్స్ వైపు మళ్లించాలి’

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions